న్యూ ఢిల్లీ: లోక్ సభ ఎన్నికలకు వేళయింది. ప్రజలు, రాజకీయ నాయకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణంలో ఎన్నికల కమిషన్ నగారాపై స్పష్టత నిచ్చింది. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ అధికారికంగా అనౌన్స్ చేసింది.
జనతా ఈ పేపర్ కోసం క్లిక్ చేయండి..
https://epaper.janathadaily.in/view/228/15-03-2024
16న మధ్యాహ్నం ఎన్నికల కమిషన్ అధికారుల ప్రెస్ మీట్ పెట్టి వివరాలు తెలియజేయనున్నారు. లోక్ సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించనుంది. దీంతో ఎన్నికలు ఏప్రిల్ నుంచి మే వరకు ఉండే అవకాశం ఉందని తెలుస్తంోది. 2019 సంవత్సరం మాదిరిగానే ఈసారి ఈ రెండు నెలల్లో నిర్వహించనున్నారని తెలుస్తోంది.
Press Conference by Election Commission to announce schedule for #GeneralElections2024 & some State Assemblies will be held at 3 pm tomorrow ie Saturday, 16th March. It will livestreamed on social media platforms of the ECI pic.twitter.com/1vlWZsLRzt
— Spokesperson ECI (@SpokespersonECI) March 15, 2024