కోరుట్ల, జనత న్యూస్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 67 వ వర్ధంతిని పురస్కరించుకొని కోరుట్లలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీ అర్ ఎస్ పార్టీ తరపున మెదటీసారి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పాల్గొని అంబేద్కర్ విగ్రహంనకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన వర్ధంతిని పురస్కరించుకుని మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దళిత జాతి అభ్యున్నతి కొరకు నిర్విరామంగా కృషిచేసిన మహానుభావుడని మన దేశంలో అట్టడుగు వర్గాలు, దళితులు బహుజనులు సామాజిక వివక్షతకు గురై కనుమరుగయ్యే పరిస్థితులలో వారందరికీ వెలుగు జ్యోతిగా వెలసిన మహానుభావుడని తన జీవితాన్ని అణగారిన వర్గాల సంక్షేమం కోసం అంకితం చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు ఇట్టి కార్యక్రమంలో బీఅర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అన్నం అనీల్ మైనార్టీ నాయకుడు ఎ అర్ అక్బర్, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిద్దాం..
- Advertisment -