హైదరాబాద్ :
తెలంగానలో ఖైరతాబాద్ మహాగణపతి ప్రత్యేకతలు చెప్పనక్కర లేదు. అనేక రికార్డులు సొంతం చేసుకున్న ఇక్కడి గణనాథునికి కానుకలూ అదే స్థాయిలో వచ్చాయి. నేడు జరుపుతున్న నిమజ్జనం సందర్భంగా సోమవారం హుండీని లెక్కించారు. కానుకల ద్వారా రూ. 70 లక్షలు, వివిధ సంస్థల ప్రకటన రూపంలో మరో రూ. 40 లక్షలు వచ్చినట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. ఇంకా ఆన్లైన్, నగదు, ఇతరాత్ర ఆధాయాన్ని లెక్కించాల్సి ఉందని తెలిపారు. కాగా..ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్రకు విశేష జనం తరలి వచ్చారు. వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా లక్షలాది మంది ఈ వేడుకలను తిలకిస్తున్నారు.
ఖైరతాబాద్ మహా గణపతి ఆదాయం ఎంతంటే..
- Advertisment -