Wednesday, July 2, 2025

కరీంనగర్‌ జిల్లాకు చేరిన సీఎం కప్‌ క్రీడాజ్యోతి

కరీంనగర్‌-జనత న్యూస్‌
గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నవంబర్‌ లో సీఎం కప్‌ పోటీలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా టార్చ్‌ ర్యాలీ నిర్వహిస్తున్నారు. సీఎం కప్‌ క్రీడోత్సవాలకు సంబంధించిన క్రీడాజ్యోతి ర్యాలీ బుధవారం కరీంనగర్‌ కు చేరుకుంది. క్రీడాజ్యోతి ర్యాలీకి కమాన్‌ వద్ద కలెక్టర్‌ పమేల సత్పతి, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి, సీపీ అభిషేక్‌ మహంతి, అదనపు కలెక్టర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, నగరపాలిక కమిషనర్‌ చాహత్‌ భాజ్‌ పేయి, యువజన క్రీడల అధికారి శ్రీనివాస్‌ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ..త్వరలో జరగబోయే సీఎం కప్‌ గురించి ప్రజల్లో అవగాహన కల్పించి పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుండి ఎక్కువ క్రీడాకారులు పాల్గొనే విధంగా కృషి చేయాలన్నారు. అలుగునూర్‌ చౌరస్తా నుండి కమాన్‌ మీదుగా అంబేద్కర్‌ స్టేడియం వరకు అట్టహాసంగా ఈ ర్యాలీ కొనసాగింది. ఇందులో సుమారు 800 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీ ఆర్‌ఓ పవన్‌ కుమార్‌, ఆర్డిఓ మహేశ్వర్‌, జిల్లా ఉన్నతాధికారులు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page