కరీంనగర్,జనత న్యూస్: రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ట్రాఫిక్ క్లియరెన్స్ లో పాల్గొని పోలీస్ డ్యూటీ చేశారు. కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాజేందర్ రావు ప్రచార కార్యక్రమంలో భాగంగా నస్తులాపూర్ కార్నర్ మీటింగ్ వద్ద రాజీవ్ రహదారిపై వాహనాలు నిలిచి పోవడంతో ప్రచార రథంపై నుంచి కిందకు దిగిన మంత్రి పొన్నం ప్రభాకర్ రోడ్డుపైకి వచ్చి తమ కార్యకర్తలతోపాటు రోడ్డుపై నిల్చున్న వారిని తానే స్వయంగా పక్కకు జరిపాడు. వాహనాల రాకపోకలు కొనసాగేలా చూశారు.
కరీంనగర్: పోలీస్ డ్యూటీ చేసిన మంత్రి ‘పొన్నం’
- Advertisment -
