Saturday, September 13, 2025

జిల్లా కలెక్టర్ ను కలిసిన జడ్జీలు..

కరీంనగర్,జనత న్యూస్: ఉమ్మడి జిల్లాలోని పలువురు జడ్జిలు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని సోమవారం తన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 9 మంది జడ్జిలు విధుల్లో భాగంగా శిక్షణ తీసుకుంటున్నారు.పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శిక్షణకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈవీఎం గోదాము పరిశీలన..

కరీంనగర్ కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ తో కలిసి పరిశీలించారు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను భద్రపరిచేందుకు గోదాంలో గదులను పర్యవేక్షించారు. అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. ఈవీఎంలను భద్రపరిచేందుకు అనుకూలంగా ఉన్న గదులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఈవీఎంల నోడల్ ఆఫీసర్ కిరణ్ ప్రకాష్, కలెక్టరేట్ ఏవో సుధాకర్, సూపరిండెంట్ శ్రీవాణి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page