హైదరాబాద్, జనతా న్యూస్: జెఈఈ సెషన్ 1 పరీక్ష ఫలితాలు ఫిబ్రవరి 12న మంగళవారం విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన జాతీయ పరీక్షా సంస్థ(NTA) ఇప్పటికే కీ ని విడుదల చేసింది. పేపర్ 1 కు దేశవ్యాప్తంగా 12,21,615 మంది దరఖాస్తు చేసుకోగా 11,70,036 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎన్ టీ ఏలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ సీట్ల భర్తీకి జనవరి 24న నిర్వహించిన పేపర్ 2 పరీక్షకు 74 ,002 మంది దరఖాస్తు చేసుకోగా 55,493 మంది హాజరయ్యారు. సెషన్ 2 ను ఏప్రిల్ 4 నుంచి 15 మధ్య నిర్వహించనట్లు ఎన్ టి ఏ షెడ్యూల్ ప్రకటించింది గతంలో ఒకేసారి రెండు విడతలు కు దరఖాస్తు చేసిన వారు మళ్లీ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది సెషన్ టూ కు హాజరు కావాలనుకుంటున్న విద్యార్థులు మార్చి రెండవ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
JEE : జెఈఈ సెషన్ 1 పరీక్ష ఫలితాలు
- Advertisment -