Thursday, September 19, 2024

Jammu Khasmir : జమ్మూ కాశ్మీర్లో కాల్పులు..5గురు పాక్ ఉగ్రవాదులు హతం..

Jammu Khasmir : భారత్ బార్డర్ కాశ్మీర్లో జరిగిన కాల్పల్లో 5గురు పాకిస్తాన్ కుచెందిన ఉగ్రవాదుల హతమయ్యారు. భారత్ లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన వీరిని భద్రతా బలగాలు అప్రమత్తమై మట్టుపెట్టారు. ఈ సంఘటనకు సంబంధించి ఉన్నతాధికారులు వివరాలు వెల్లడించారు. వారు తెలిపిన ప్రకారం.. జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా జిల్లా మచిల్ వద్ద సరిహద్దు రేఖ నుంచి కొందరు ముష్కరులు అక్రమంగా భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దీంతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భారత సైన్యం కలిసి ఆ కుట్రను భగ్నం చేశారు. ఈ క్రమంలో కాల్పులు జరిపి 5గురు ఉగ్రవాదులను మట్టుపెట్టారన్నారు. వీరు లష్కరే తోయిబా అనే ఉగ్ర సంస్థకు చెందిన వారని జమ్మూ కాశ్మీర్ అడిషనల్ డీజీ విజయ్ కుమార్ వెల్లడించారు. అయితే ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని పేర్కొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page