Saturday, September 14, 2024

అక్రమార్కుల గుండెల్లో గుబులు..హైడ్రా

నెల రోజుల్లో 18 కూల్చివేతలు..
43 ఎకరాల భూమి కాపాడిన సంస్థ
రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు, కొందరి నుండి విమర్శలు
హైదరాబాద్‌ :
హైడ్రా పేరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మారు మోగుతోంది. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది ఈ సంస్థ. తాజాగా హీరో నాగార్జున ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత..రాష్ట్ర వ్యాప్త చర్చకు తెర లేపింది. సంస్థ ఏర్పడి నెల రోజుల్లోనే దూకుడుగా వ్యవహరించి..18 చోట్ల కూల్చివేత లకు పాల్పడిరది. ఇందులో సీఎం రేవంత్‌ రెడ్డి మార్కు స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్‌ పరిసరాల్లో మొత్తం 18 చోట్ల కూల్చివేతకు పాల్పడ్డ హైడ్రా..43 ఎకరాల స్థలాన్ని కాపాడ గలిగింది. ఇందులో నందినగర్‌ లోని ఎకరం, లోటస్‌ పాండ్‌, మనసురాబాద్‌ సహారా ఎస్టేట్‌, ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో పార్కు స్థలం, మిథాలీ నగర్‌లో పార్కు, బి జె ఆర్‌ నగర్‌ లో నాలా కబ్జా, గాజుల రామారం మహాదేవ్‌ నగరంలో రెండంతస్తుల భవనం, భూదేవి హిల్స్‌, బంజారా హిల్స్‌ లో రెస్టారెంట్‌ భవనం, చింతల్‌ చెరువులో, నందగిరి హిల్స్‌, రాజేంద్రనగర్‌ చెరువు, ఎంఐఎం ఎమ్మెల్యే మోబిన్‌ నిర్మిస్తున్న భవనం, ఎం ఎల్‌ సి మిర్జా బేగ్‌ నిర్మించిన రెండంతస్తుల భవనం, చందానగర్‌ ఏర్ల చెరువు, ప్రగతి నగర్‌ ఎర్రగుంట, బోడుప్పల్‌ చెరువులో, గండిపేట చెరువు..ఇలా ఆయా ప్రాంతాల్లోని చెరువులు, కుంటల్లోని అక్రమ కట్టడాలను కూల్చి వేసింది హైడ్రా. ఇందులో అధికార, ప్రతిపక్ష పార్టీల నేత లెవరినీ వదలకుండా..తమ పని తాము చేసుకుంటూ పోయింది. ఐపీఎస్‌ అధికారి రంగానాథ్‌ నేతృత్వంలో పకడ్భందీగా ఈ కూల్చివేత ఆపరేషన్‌ కొనసాగింది. నందగిరి హిల్స్‌ కబ్జాల్లో అడ్డుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పై కూడా కేసు నమోదు కావడం విశేషం. మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, టీటీడీ మాజీ సభ్యుడు కావేరి సీడ్స్‌ యజమాని, బిజెపి కీలక నేత సునీల్‌ రెడ్డి, ప్రో కబడ్డీ యజమాని అనుపమ ఫామ్‌ హౌజ్‌..ఇలా వీఐపీ లనూ, ఎవరినీ వదలకుండా అక్రమ కట్టడాలపై కొరడా రaులిపించింది హైడ్రా. కూల్చివేతల్లో ఆస్తుల్లో కోల్పోయిన వారి నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతుండగా..సామాజిక, పర్యావరణ వేత్తలు హర్షిస్తున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page