కరీంనగర్-జనత న్యూస్
సద్దుల బతుకమ్మ, దసరా పండుగలను దృష్టిలో ఉంచుకుని కరీంనగర్లో చేనేత`జౌళిశాఖ వస్త్ర ప్రదర్శన శాలను ఏర్పాటు చేస్తుంది. ఈ నెల 7, 8 తేదీల్లో కరీంనగర్ కలెక్టరేట్లో ఏడీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో వస్త్ర ప్రదర్శన శాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పోంచంపల్లి ఇక్కత్ చీరలు, ఇతర వస్త్రాలను అందుబాటులో ఉంచనున్నారు. ఈ రెండు రోజులు ఉదయం పది గంటల నుండి సాయంత్రం 5 వరకు వస్త్రాలను అందుబాటులో ఉంచనున్నారు. మార్కెట్ ధర కన్నా తక్కువ ధరలో అందుబాటులో ఉండనున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరుతున్నారు.
కరీంనగర్లో పోచంపల్లి ఇక్కత్ చీరలు…ఎప్పుడంటే..

- Advertisment -