Friday, September 12, 2025

గాల్లో ఢీకొన్న హెలీక్యాప్టర్లు..10 మంది మృతి..

గాల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రెండు హెలీక్యాప్టర్లు ఢీకొని 10మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.  మలేషియాలో చోటుచేసుకున్న ఈ ప్రమాదం గురించి అధికారుల తెలిపిన కథనం ప్రకారం మలేషియాలో ఏప్రిల్ 26న రాయల్ మలేషియన్ నేవీ దినోత్సవం జరగనుంది. ఇందుకోసం పెరక్ లోని లుమత్ ప్రాంతాల్లో మంగళవారం రియర్సల్స్ నిర్వహించారు. ఈ క్రమంలో ఉదయం శిక్షణ విన్యాసాల నిమిత్తం పడంగ స్థితి ఆవాన్ నుంచి గాల్లోకి రెండు హెలీక్యాప్టర్లు ఎగిరాయి.   అయితే కొద్ది సేపటికే ప్రమాదవశాత్తూ  ఇవి రెండు ఢీకొన్నాయి. దీంతో అక్కడికక్కడే కుప్పకూలాయి. వీటిలో ఒకటి విన్యాసాలు జరుగుతున్న ప్రాంతానికి పక్కనే ఉన్న స్థానిక స్టేడియంలో కూలిపోయింది. మరొకటి స్విమ్మింగ్ పూల్ లో పడిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లలో ఉన్న పది మంది సిబ్బంది మరణించారు. వీరిలో ఇద్దరు లెఫ్టినెంట్ కమాండర్లు కూడా ఉన్నారు. హెలిక్యాప్టర్లు కూలుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

 

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page