హైదరాబాద్, జనత న్యూస్: తెలంగాణ కేబినెట్ మీటింగ్ కు ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ సమావేశానికి కొన్ని షరతులు విధించింది. కేబినెట్లో అత్యవసర విషయాలు మాత్రమే మాట్లాడాలని తెలిపింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ వంటి విషయాలను వాయిదా వేయాలని షరతు పెట్టింది. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు మీటింగ్ కు వెళ్లకూడదని తెలిపింది. ఎలక్షన్ కమిషన్ అనుమతి రాకపోవడంతో శనివారం జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడిన విషయం తెలిసిందే. శనివారం మధ్యాహ్నం కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోగా ఎన్నికలకు కోడ్ అమలులో ఉన్నందున అధికారులు ఈసీ అనుమతి కోరారు. అయితే శనివారం రాత్రి వరకు కూడా ఈసీ నిర్ణయం చెప్పకపోవడంతో కేబినేట్ సమావేశం వాయిదా పడింది.
కేబినేట్ భేటికి గ్రీన్ సిగ్నల్
- Advertisment -