Tuesday, August 27, 2024

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి: కలెక్టర్

జగిత్యాల, జనతా న్యూస్: యాసంగి 2023-24 ధాన్యం వరి కోతల షెడ్యూల్ ప్రకారం జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు.మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి ధాన్యం కొనుగోలు, వేసవిలో త్రాగునీటి సరఫరా ప్రణాళికపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ, యాసంగి పంట కోతలకు వస్తున్న నేపథ్యంలో జిల్లా స్థాయిలో వరి కోతలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తననియమావళిని అనుసరిస్తూ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉంటుందని, అధికారులు మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం చేయాలని, ఎక్కడా ప్రజా ప్రతినిధులు పాల్గోనవద్దని అన్నారు.

ప్రతి జిల్లాలో వరికోతలననుసరించి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు షెడ్యూల్ రూపోందించు కోవాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ తెలిపారు. యాసంగి పంట కొనుగోలుకు రాష్ట్ర వ్యాప్తంగా 7149 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉంటుందని, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌళిక వసతులు కల్పించాలని, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి సరఫరా, టెంట్లు వంటి మౌలిక ఏర్పాట్లు చేయాలని సి.ఎస్. అన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ప్యాడి క్లీనర్లు, తేమ యంత్రాలు, వెయింగ్ యంత్రాలు, టార్ఫాలిన్లు, గన్ని బ్యాగులు సన్నద్ధం చేసుకోవాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలు, సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని సకాలంలో రైస్ మిల్లులకు రవాణా చేసేందుకు అవసరమైన వాహనాలు సిద్ధం చేసుకోవాలని అన్నారు.

చివరి గింజ వరకు నాణ్యమైన ధాన్యాన్ని మద్దతు ధరపై ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎక్కడ తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన అవసరం లేదనే సందేశం రైతుల వద్దకు వెళ్లేలా అవగాహన కల్పించాలని, భారత ఆహార సంస్థ నిర్దేశించిన ధాన్యం నాణ్యత ప్రమాణాలు, తేమ శాతంపై విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు, రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టుకొని నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకుని వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి సంబంధిత మిల్లర్లకు కేటాయించాలని, రైస్ మిల్లు వద్ద ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కోత రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైస్ మిల్లర్ల వద్ద హమాలీల కొరత రాకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం రైతులు ధాన్యాన్ని తీసుకుని వచ్చే విధంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షేక్ యాస్మీన్ బాషా మాట్లాడుతూ, జిల్లాలో 409 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో ఐకేపి 133, పాక్స్ 275, మెప్మా ఒకటి, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు.అనంతరం సి.ఎస్. త్రాగునీటి పై సమీక్ష నిర్వహిస్తూ, వేసవి కాలంలో త్రాగునీటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ త్రాగునీటి సరఫరాలో వచ్చే చిన్న చిన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ప్రతి గ్రామం, మున్సిపల్ వార్డు స్థాయిలో త్రాగునీటి సరఫరాకు ప్రణాళికలు తయారు చేసుకోవాలని, త్రాగునీటి పైప్ లైన్ లీకేజీలు అరికట్టాలని తెలిపారు.

జిల్లాలో త్రాగునీటి అవసరాల మేరకు బోరు బావులను, పాత త్రాగునీటి సరఫరా మోటార్లను పునరుద్ధరించాలని, త్రాగునీటి సరఫరా నిమిత్తం అవసరమైన పనులను వెంటనే చేపట్టాలని, ఎక్కడ నిధులకు ఆటంకం లేనందున అత్యంత ప్రాధాన్యతతో త్రాగునీటి సరఫరా పనులు పూర్తి చేయాలని అన్నారు.

గ్రామీణ నీటి సరఫరా శాఖ పరిధిలో ఉన్న త్రాగునీటి వ్యవస్థను ఒకసారి పరిశీలించి అవసరమైన మరమ్మత్తులు పూర్తిచేయాలని తెలిపారు. త్రాగునీటి సరఫరాలో ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్ల చేసేందుకు సన్నద్ధం కావాలని ప్లాన్ బీ తయారు చేసుకోవాలని అన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ త్రాగునీటి పై మాట్లాడుతూ, జిల్లాలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళకలు చేపట్టామని, 448.36 లక్షలతో వివిధ పనులు చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలో 3975 బోర్ వెల్స్ ఉండగా, 764 మరమ్మత్తులు చేపడుతున్నామని, 739 పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. 191 పైప్ లైన్ రిపేర్ గాను 163 పూర్తి అయ్యాయని, 161 పంపు సెట్స్ మరమ్మతులకు గాను 149 పూర్తి అయ్యాయని తెలిపారు. కొత్తగా 371 మంజూరు కాగా 158 పనులు పూర్తి చేశామని, మిగతా 213 పనులు పురో గతిలో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.ఈ వీడియో సమావేశంలో drdo సంపత్ రావు, జిల్లా వ్యవసాయ అధికారిణి వాణి, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్, ఇంట్రా ఈ ఈ, గ్రిడ్ ఈ ఈ లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Trending...

Most Popular