సిరిసిల్ల, జనతా న్యూస్:రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో గీతా మందిరం24వ వార్షికోత్సవం, మద్భగవీత 34వ వార్షికోత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం శివ కళ్యాణం ఘనంగా నిర్వహించారు.
శ్రీ మద్భగవద్గీత సేవా సమితి అధ్యక్షుడు బ్రహ్మచారి లక్ష్మారెడ్డి, కార్యదర్శి రాచర్లత రఘురామ శర్మ ఆధ్వర్యంలో శివ కళ్యాణం, సుబ్రహ్మణ్య స్వామి గీతా ఆద్యా హవనము పాలెపు రవీందర్ శర్మ నరహరి శర్మ రాము శర్మ విద్యాధర శర్మ రామచంద్ర శర్మ సందీప్ శర్మ నిర్వహించారు .
ఈ కార్యక్రమంలో భక్తులు మంగళహారతులతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఏలూరు ప్రణవ పీఠాధిపతి పద్దిపర్తి పద్మాకర్ ప్రవచనాలు చేయగా భక్తులు ఆసక్తిగా విన్నారు. సాయంత్రం 6 గంటలకు రాధాకృష్ణ స్వామి ఎదుర్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో లక్ష్మారెడ్డిబద్దం రామ్ రెడ్డి దుబ్బ విశ్వనాథం శాగా రాజేశం సత్తయ్య ఇల్లందుల శ్రీనివాస్ రెడ్డి ముత్యాల ప్రభాకర్ రెడ్డి రాచర్ల లలితమ్మ పందిర్ల సుజాత పయ్యావుల మంజుల రజిత పద్మ ప్రసన్న నిర్మల పాలేపు అనిత పద్మ శంకరవ్వ పరిసర ప్రాంత మండలాలు గంభీరావుపేట వీర్నపల్లి ముస్తాబాద్ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ కరీంనగర్ జగిత్యాల పట్టణాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.