Thursday, September 19, 2024

బాలికలు, మహిళలకు ప్రత్యేక భద్రత

పని చేసే ప్రాంతాల్లో షీ టీమ్‌ల అవగాహన
రద్దీ ప్రాంతాల్లో మఫ్టీలో నిఘా
జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

సిరిసిల్ల-జనత న్యూస్‌
బాలికలు, మహిళలకు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. సిరిసిల్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కళాశాలు, పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు ర్యాగింగ్‌, ఈవ్‌టీజింగ్‌ పడే శిక్షలు.. పోక్సో, యాంటీ హ్యుమెన్‌ ట్రాఫికింగ్‌ లపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ హాజరై మాట్లాడుతూ..జిల్లా వ్యాప్తంగా రద్దీగల ప్రాంతాల్లో షీ టీమ్‌ సిబ్బంది మఫ్టీలో నిఘా ఉంటున్నారని తెలిపారు. మహిళలను వేధిస్తున్న పోకిరీలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మహిళలు,బాలికలు వేధింపులకు గురైతే వెంటనే జిల్లా షీ టీమ్‌ నెంబర్‌ 8712656425 లేదా డయల్‌ 100 కు పిర్యాదు చేయాలని సూచించారు. విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోస ఇచ్చారు. ఆకతాయిల వేధింపుల నుండి మహిళల రక్షణకు పోలీస్‌ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. మహిళలు ముఖ్యంగా సామాజిక మధ్యమాలైన ఫేస్‌ బుక్‌, వాట్స్‌ అప్‌, ఇన్‌ స్టాగ్రామ్‌ ల వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఫోటోలు, వీడియోలను పోస్ట్‌ చేసే సమయంలో, వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page