Tollywood: హర్రర్ సినిమాలంటే ఎవరికైనా క్రేజ్ ఉంటుంది. కానీ దీనిని ప్రేక్షకులకు నచ్చే విధంగా తీయడంలో కొందరికి మాత్రమే కళ ఉంటుంది. ఓవైపు హారర్ ను చూపిస్తూనే మరోవైపు కామెడీతో కడుపుబ్బా నవ్వించిన చిత్రం గీతాంజలి. అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా వచ్చి దాదాపు పదేళ్లు అవుతుంది. ఇన్నేళ్ల తర్వాత దీనికి సీక్వెల్ గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనే సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. శివ తుర్లపాటి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాని కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా సంస్థలు కలిసి నిర్మించాయి. ఏప్రిల్ 11న ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో అంజలితో పాటు శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, ఆలీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Geethanjali Malli Vachhindi: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ట్రైలర్ చూశారా?
- Advertisment -