లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డి పేట చొరవ
సుమారు 600 మందికి పరీక్షలు, మందుల పంపిణీ
క్లబ్ ఛైర్మన్ కోట సతీష్ కుమార్కు ఘన సత్కారం
వీర్నపల్లి-జనత న్యూస్
సేవ కార్యక్రమాల్లో మేటిగా నిలుస్తోంది లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట. నిన్నటి వరకు మహిళలకు మగ్గం వర్క్స్లో శిక్షణ ఇప్పించిన ఆ సంస్థ ప్రతినిధులు..తాజాగా మారుమూల వీర్నపల్లి మండలంలోని పేదల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మండల కేంద్రం లోని ప్రభుత్వ పాఠశాలలో శనివారం లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపును జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ వసంత్ రావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ పెంచలయ్య ఆద్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి మంచి స్పందన వచ్చింది. సుమారు 600 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన రోగులకు భోజన సదుపాయల కల్పించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట అధ్యక్షులు కోట సతీష్ కుమార్ మాట్లాడుతూ..మారుమూల ప్రాంత మండలమైన వీర్నపల్లిలో హెల్త్ క్యాంపు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రయివేటు ఆసుపత్రిలో ఖరీదైన వైద్య సేవలు పొందలేని వారు..తమ ఈ వైద్య శిబిరంలో పరీక్షలు చేసుకున్నారని తెలిపారు. రానున్న కాలంలో మరిన్ని సేవ కార్యక్రమాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో ఎక్కడైనా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తే తమవంతు సాకారం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్ డాక్టర్ అభినయ్, ఎల్లారెడ్డిపేట ఆరోగ్య కేంద్రం సూపరిండెంట్ డాక్టర్ బాబు, లయన్స్ క్లబ్ సెక్రటరీ నాయన భాస్కర్ రెడ్డి, ట్రెజరర్ రావుల లింగారెడ్డి, డిస్టిక్ట్్ క్యాబినెట్ మెంబర్స్ ముత్యాల శ్రీనివాసరెడ్డి, పయ్యావుల రామచంద్రం, ఇతర లయన్స్ బాధ్యులు సద్ది లక్ష్మారెడ్డి, బోయిని మహదేవ్, పెంజర్ల దేవయ్య, రావుల ముత్యం రెడ్డి, పార్టీ దేవయ్య, లయన్ డాక్టర్ అమరేందర్ రెడ్డి, డాక్టర్ల బృందం పాల్గొంది.
లయన్స్ క్లబ్ ఛైర్మన్ కోట సతీష్ కుమార్కు ఘన సత్కారం
వీర్ణపల్లిలో మెగా హెల్త్ క్యాంపు సక్సెస్ చేసిన కోట సతీష్ కుమార్ను క్లబ్ ప్రతినిధులు, సభ్యులు, పలువురు ప్రముఖులు సత్కరించారు. మారుమూల ప్రాంతమైన వీర్ణపల్లిలోని నిరుపేద రోగులకు అధునాతన వైద్య సేవలందించేలా కృషి చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్కు వారు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్లో మరిన్ని సేవలు చేస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు