కరీంనగర్-జనత న్యూస్
ఫెడరేసన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటా సౌత్ రీజియన్ అసిస్టెంట్ సెక్రటరీగా కరీంనగర్ ఫిలిం ఫిలిం సొసైటీ అధ్యక్షులు పొన్నం రవిచంద్ర ఎన్నికయ్యారు. కర్ణాటక లోని బెంగూళూర్ లోని సుచిత్ర ఫిలిం సొసైటీలో ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా వార్షిక సమావేశం నిర్వహించారు. ఇందులో సౌత్ రీజియన్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీగా పొన్నం రవిచంద్రను ప్రకటించారు కార్యదర్శి ప్రకాష్ రెడ్డి . ఈ మేరకు ఎన్నిక పత్రాన్ని రవిచంద్ర కు అందించారు. రవిచంద్ర గత కొన్నేళ్లుగా ఫిల్మ్ సొసైటీ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ, అనేక సినీ వ్యాసాలు రాస్తున్నారు. సీనియర్ జర్నలిస్ట్గా, ఫిల్మ్ క్రిటిక్గా మంచి పేరు తెచ్చుకున్న రవిచంద్ర.. ‘ప్రస్థానం’ సినీ గ్రంధముతో నంది అవార్డు సొంతం చేసుకున్నారు. బాలీవుడ్ నటులు పైడి జైరాజ్ పై రూపొందించిన డాక్యుమెంటరీ పలు ఇంటర్నేషనల్ వేదికలపై ప్రదర్శించబడి ఆరు అవార్డులను అందుకోగా, ఇటీవలనే వచ్చిన ‘సర్దార్ సర్వాయి పాపన్న’ డాక్యుమెంటరీ పలువురి ప్రశంశలు పొందింది. రవిచంద్ర ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా సౌత్ రీజియన్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఎంపిక కావడం పట్ల కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ కార్యదర్శి లక్ష్మి గౌతమ్ తో పాటు సంస్థ సభ్యులు అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా ఫిల్మ్ క్రిటిక్ రమేష్ బాబు, రామ్మోహన రాయుడు, పి. ఎస్. రవీంద్ర, అక్షరయాన్ అద్యక్షురాలు అయినంపూడి శ్రీలక్ష్మి, అన్నవరం దేవేందర్, మాడిశెట్టి గోపాల్, గాజోజు నాగభూషణం, కందుకూరి అంజయ్య, నంది శ్రీనివాస్, గాజుల రవీందర్, కె ఎస్ ఆనంతాచార్య శుభాకాంక్షలు తెలిపారు.
ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీ సౌత్ రీజియన్.. అసిస్టెంట్ జనరల్ సెక్రటరీగా డాక్టర్ పొన్నం రవిచంద్ర
- Advertisment -