న్యూఢిల్లీ: గన్ పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది అక్కడికక్కడమే మృతి చెందారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బెమెతార జిల్లాలోని బెర్లా బ్లాక్ లో గన్ పౌడర్ తయారీ కేంద్రంలో శనివారం ఉదయం ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడ్డవారిని రాయ్ పూర్ లోని మెహకారా ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
గన్ పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు.. 17 మంది మృతి
- Advertisment -