చివరకు కట కటాలకు !
గాంజాపై పోలీసుల ఉక్కుపాదం
జిల్లాలో 32 కిలోలు పట్టివేత
ఎస్పీ అఖిల్ మహాజన్ స్ఫెషల్ ఫోకస్
సిరిసిల్ల-జనత న్యూస్
గాంజా, అక్రమ కార్యకలాపాలపై సిరిసిల్ల పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. వీటిపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్ఫెషల్ ఫోకస్ పెట్టారు. తాజాగా తంగళ్లపల్లి శివారులో నిందితుల వద్ద నుండి 3 కిలోల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడిరచారు. ఆదిలాబాద్ జిల్లా గాయిదిగూడ మండలం గొండు రూపాపూర్కు చెందిన మాడవి దిగంబర్, తురం అమృత్ రావులు కలసి తంగళ్లపల్లి శివారులో గంజాయి అమ్మెందుకు రాగా..సమాచారం తెలుసుకున్న ఎస్ఐ సుధాకర్ పోలీసు సిబ్బందితో కలసి వెల్లి పట్టుకున్నారు. వారి వద్ద నుండి మూడు కిలోల గంజాయి, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారించగా..తంగళ్లపల్లికి చెందిన క్రాంతి అనే వ్యక్తికి అమ్మెందుకు తీసుక వచ్చినట్లు తేలింది. దీంతో క్రాంతిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఈ సంవత్సరంలో 32 కిలోల గంజాయి పట్టివేత
జిల్లాలో ఈ సంవత్సరం 32 కిలోల 618 గ్రాముల గంజాయిని పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇందుకు సంబంధించి 54 కేసులు నమోదు చేసి 134 మందిని అరెస్టు చేసినట్లు ఆయన వివరించారు. సిరిసిల్లను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు స్ఫెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు తెలిపారు. గంజాయి రవాణా, విక్రయాలపై డయల్ 100, లేదా టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ 87126 56392 నెంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈజీ మనీ, జల్సాలకు అలవాటు పడి యువత మత్తు రవాణా వైపు వెళ్తున్నారని..చివరకు జైలుపాలై జీవితాన్ని అంధ కారం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఎస్పీ అఖిల్ మహాజన్. చెడు మార్గాన వెళ్లవద్దని వారికి హితవు చెప్పారు. ఈ సమావేశంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ లు మొగిలి, ఎస్ ఐ లు సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు.