హనుమకొండ, జనతా ప్రతినిధి: ఒంటిపై ఎక్కడపడితే అక్కడ టాటూలు వేసుకోవడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. ఒకప్పుడు ప్రేమతో తల్లిదండ్రుల పేర్లు నేతిపై రాసుకునేవారు కానీ ఇప్పుడు పెద్ద పెద్ద డిజైన్లతో కూడిన టాటూలను ఒంటిపై వేసుకుంటున్నరు ఇప్పటి యువత. టాటూ వేసుకోవడం అందంగానే ఉన్నా దానితో బ్లడ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టాటూలతో లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్ వచ్చే ముప్పు 21 శాతం అధికంగా ఉందని స్వీడన్ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. 20 నుండి 60 ఏళ్ల వయసు ఉన్న 12 వేల మందిపై వారు అధ్యయనం చేయగా ఈ నిజాలు వెళ్లడయ్యాయట. చర్మంపై టాటు ఇంకు పడగానే రోగ నిరోధక వ్యవస్థ ప్రభావానికి గురవుతుందని, దీంతో లింఫోమా క్యాన్సర్ రావచ్చని, టాటూ సైజును బట్టి తీవ్రత ఉంటుందని, దీనిపై మరింతగా లోతైన పరిశోధనలు అరగాల్సి ఉండని నిపుణులు చెబుతున్నారు. అందంగా ఉందని టాటూ వేసుకునే బదులు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిది. టాటూ తో వచ్చేది ఏమీ లేదని ఇస్తున్నారు. ఆరోగ్య నిపుణులు సలహా
టాటూలు వేసుకుంటున్నారా..?
- Advertisment -