న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎం వీవీ ప్యాట్ల క్రాస్ వెరిఫికేషన్ పై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పునిచ్చింది. ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లలో వీవీ ప్యాడ్ల స్లిప్పులను లెక్కించాలన్న పిటిషన్లను సుప్రీం తిరస్కరించింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ తీపాంకర్ దత్తత తొ కూడిన దిసభ్య ధర్మసనం ఒకే అభిప్రాయంతో రెండు తీర్పులు వెలువరించింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలు ఈవీఎం వీవీ ప్యాడ్ల క్రాస్ వెరిఫికేషన్ పై పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు విస్తృతంగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రోటోకాల్ సాంకేతిక అంశాలపై ఎన్నికల సంఘానికి పలు సూచనలు చేసింది. అనంతరం తీర్పును రిజర్వు చేసింది. శుక్రవారం పేపర్ బ్యాలెట్ ఓటింగ్ డిమాండ్లతో సహా అన్ని పిటిషన్లను కొట్టి వేస్తూ తీర్పు నిచ్చింది. ఈవీ ఎంలలో సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ యూనిట్ ను సీల్ చేయాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. దానిని కనీసం 45 రోజుల పాటు భద్రపరచాలని తెలిపింది. ఫలితాల ప్రకటన తర్వాత అభ్యర్థులు ఏడు రోజుల్లోపు తమ అభ్యంతరాలు తెలియజేయాలని, అప్పుడు ఇంజనీరింగ్ బృందం మైక్రో కంట్రోల్ ఈవీయంలో బర్న్ చేసిన మెమొరిని తనిఖీ చేయాలని తెలిపింది. ఈ వెరిఫికేషన్ కి అయ్యే ఖర్చులను అభ్యరంతరాలు లేవనెత్తిన అభ్యర్లులే భరించాలని వెల్లడించింది. ఒకవేళ ఈవీఎం ట్యాంపర్కు గురైనట్లు తేలితే ఖర్చులు తిరిగి ఇవ్వాలని సూచించింది.
వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు పిటిషన్లు కొట్టివేత
- Advertisment -