Friday, September 12, 2025

కరీంనగర్ లో సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ సేవలు..

 

కరీంనగర్, జనతా న్యూస్: రోజు రోజుకీ సైబర్ నేరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ  తీసుకుంటున్న చర్యల్లో భాగంగా  అన్ని జిల్లాలు,  కమిషనరేట్లయందు సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లను , తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో  ఇటీవల ప్రారంభించారు. ఇందులో భాగంగా కరీంనగర్ కమిషనరేట్ కి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ను కేటాయించారు. ఇందులో  మంగళవారం నుంచి పూర్తి స్థాయిలో (సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్) సేవలు అందుబాటులోకి వచ్చాయని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి ఒక ప్రకటనలో తెలిపారు.

కరీంగనగర్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ కు  ఎస్ హెచోఓ గా ఏసీపీ నర్సింహారెడ్డి ని నియమించారు.  భాదితులు నేరుగా వచ్చి వారి సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చన్నారు.  తెలియని వ్యక్తులకు ఫోన్ల ద్వారా వ్యక్తిగత పాస్ వర్డ్ , ఓటీపీ లు అందించడం , ప్రలోభాలకు గురిచేసే లింక్ లను క్లిక్ చేయడం వంటి విషయాల్లో ఎప్పటికప్పుడు చాలా అప్రమత్తంగా వుంటూ సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. సైబర్ క్రైమ్ గురైన భాదితులు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. బాధితులు టోల్ ఫ్రీ నెంబర్ అయిన 1930 కి కూడా కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

సైబర్ వారియర్స్ టీం ఏర్పాటు.

కమిషనరేట్ వ్యాప్తంగా   సైబర్ నేరాలను పోలీస్ స్టేషన్ల వారీగా ఎక్కడికక్కడ అరికట్టి నియంత్రించేందుకు  సైబర్ వారియర్స్ టీం ను ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు. ప్రతీ పోలీస్ స్టేషన్ కు టెక్నాలజీ పై అవగాహన ఉన్న సిబ్బందిని గుర్తించి వారిని సైబర్ వారియర్ గా నియమించామన్నారు. క్షేత్ర స్థాయిలో భాదితులకు ఎప్పటికప్పుడు మెరుగైన సేవలు అందించేందుకుగాను వీరిని ఏర్పాటు చేశామన్నారు.
సైబర్ కేసుల్లో ఆధారాలు సేకరించి, నేరస్థులను పట్టుకోవడం, వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకుని భాదితులకు న్యాయం జరిగేలా చూడడం వీరి ముఖ్య విధిగా ఉంటుందన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page