జనతన్యూస్ బెజ్జంకి : ఇటీవల కురిసిన అకాల వడగండ్ల వర్షానికి నష్టపోయిన పంటలను హుస్నాబాద్ ఏ డి ఏ మహేష్ క్షేత్రస్థాయిలో శనివారం మండలంలోని లక్ష్మీపూర్, వడ్లూరు గ్రామాలలో అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నష్టపోయిన పంటల వివరాలను ఏ ఈ ఓ లు క్షేత్రస్థాయిలో నివేదిక రూపొందిస్తున్నారని, 33% పైగా పంట నష్టం జరిగిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందే విధంగా నివేదికలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఏవో సంతోష్, సాయి చరణ్, ఏఈఓ సాయి శంకర్, రైతులు ఉన్నారు.
త్వరలోనే రైతులకు పంట నష్టపరిహారం
- Advertisment -