గోశాలకు తరలించేలా చర్యలు
మున్సిపల్ కమీషనర్ హెచ్చరిక
కరీంనగర్-జనత న్యూస్
రోడ్లపై ఆవులు, గేదెలను వదిలేసి వెళ్తే, గోశాలకు తరలిస్తామని కరీంనగర్ మున్సిపల్ కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్ యజమానులను హెచ్చరించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. బుధవారం నుండి నగరపాలక సంస్థ పశు సంవర్థక విభాగం అధికారులు, సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. వీదుల్లో సంచరిస్తున్న పశువులను పట్టి గోశాలకు తరలించాలని అధికారులకు సూచించారు. నగరంలోని రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ పశువులు తిరగడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఎవరి పశువులను వారు బాధ్యతగా, ఇంటి పరిసరాల్లోని పాకల్లో ఉంచుకునేలా చూసుకోవాలని పశువుల యజమానులకు సూచించారు. పశువులు రోడ్ల పై గాని, వీదుల్లో గాని కనిపిస్తే వాటిని నేరుగా గోశాలకు తరలిస్తామని, ఆ తరువాత తమకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోబోమని హెచ్చరించారు. పశు యజమానులు బాధ్యతలు వహించి నగర ప్రజలు, సంస్థకు సాకారం అందించాలని కోరారు.