హైదరాబాద్, జనతా న్యూస్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తొంటి ఎముక విరగడంతో యశోధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను పరామర్శించడానికి రాజకీయనాయకులు, ప్రముఖులు ఆసుపత్రికి తరలివస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం యశోధ ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్ను కలిశారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. రేవంత్ రెడ్డి కంటే ముందు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆస్పత్రికి చేరుకుని కేసీఆర్ను పరామర్శించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా డాక్టర్ ప్రవీణ్రావు మాట్లాడుతూ.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గా ఉన్నదని చెప్పారు ఆర్థోపెడిక్, ఫిజియోథెరపీ వైద్యుల పర్యవేక్షనలో వాకర్ సాయంతో నడిపించే ప్రయత్నం చేయగా, ఆయన శరీరం బాగా స్పందించిందని తెలిపారు. సాధారణంగా తుంటి కీలు మార్పిడి జరిగిన పేషెంట్ను 12 గంటల్లోపు నడిపించే ప్రయత్నం చేస్తామని, దీన్ని మెడికల్ పరిభాషలో మొబిలైజేషన్ స్టార్ట్’ అంటారని వివరించారు.కేసీఆర్కు ఆపరేషన్ నొప్పి తగ్గి, సాధారణ నొప్పి మాత్రమే ఉన్నదని, ఆయన శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నారని తెలిపారు. సాధారణ ఆహారమే తీసుకుంటు న్నారని పేర్కొన్నారు. శరీరం సహకరిస్తే మరో రెండు,మూడు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని తెలిపారు.
కేసీఆర్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
- Advertisment -