జనత న్యూస్ :
రాష్ట్రంలోనే హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణపతి విగ్రహం, ఇక్కడి ఉత్సవాలు ఫేమస్. ఇక్కడి గణపతిని దర్శించుకునేందుకు ఉత్సాహం చూపుతారు. ఈ సంవత్సరం కూడా ఖైరదబాద్ గణపతి నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది ఉత్సవ కమిటీ. ఇందులో భాగంగా ఖైరతాబాద్ శ్రీ గణేశ్ నవరాత్రోత్సవ కమిటీ సీఎం రేవంత్ రెడ్డిని కలసింది. అర్చకులు సీఎంకు ఆశిర్వచనం అందజేశారు. కాగా.. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్ నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా సెప్టెంబర్ 7న గణేశ్ చతుర్థి రోజు సెలవు దినంగా ప్రకటించింది. 17వ తేదీ కూడా మిలాద్ ఉన్ నబీ పండుగకు కూడా సెలవు ప్రకటించడంతో పాటు శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా పోలీసు శాఖకు అప్రమత్తం చేసింది సర్కారు.
సీఎం రేవంత్ రెడ్డికి..ఖైరతాబాద్ గణపతి ఉత్సవ కమిటీ ఆహ్వానం
- Advertisment -