Thursday, September 11, 2025

పోలీసుల కస్టడీలో చిట్ ఫండ్ వ్యాపారి

కరీంనగర్, జనతా న్యూస్:ఖాతాదారులకు సకాలంలో డబ్బు చెల్లించలేదు..  మోసగించి, చిట్ ఫండ్ కంపెనీ నందు వారు జమ చేసుకున్న డబ్బుతో సొంత ఆస్తులు కూడబెట్టారు.. ఈ   కేసులో అక్షర చిట్ ఫండ్  చైర్మన్ పేరాల శ్రీనివాసరావు, ఇద్దరు డైరెక్టర్లు   సూర్యుని కొండలరావు ఉప్పల రాజేందర్ లను కరీంనగర్ పోలీసులు కస్టడిలోకి తీసుకున్నారు. కరీంనగర్ లోని  సీతారాంపూర్ కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి శ్రీరామ్ వెంకట్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల 21వ తేదీన వీరిని అరెస్ట్ చేశారు.  ఈ  కేసుకు సంబంధించిన మరిన్ని కీలక ఆధారాలు సేకరించేందుకు నిందితుల ముగ్గురిని కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు  ఐదు రోజులు కస్టడీలోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా కరీంనగర్ రాజీవ్ చౌక్, కోతిరాంపూర్, జ్యోతి నగర్ లో గల అక్షర చిట్ ఫండ్ బ్రాంచీలలో తనిఖీలు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్లను. కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు స్వాధీనపరచుకున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page