Thursday, September 19, 2024

Chandrababu : ఆ కేసుల్లో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్

Chandrababu :తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసులో అరెస్టును వాయిదా వేసింది. రింగ్ రోడ్డు కేసులో ఈనెల 16వ తేదీ వరకు , అంగళ్ల కేసులో ఈనెల 12 వరకు అరెస్టు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు కేసుల్లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా చంద్రబాబు తరుపున న్యాయవాది దుమ్మాలపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ కేసుల్లో సహకరిస్తామని, అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరడంతో హైకోర్టు అంగీకరించింది. ఇప్పటికే ఈ విషయం సీఐడీ, హోంశాఖకు తెలిపానని పేర్కొంది. అయితే ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పెండింగులో ఉందని కోర్టుకు ఏజీ శ్రీరామ్ తెలిపారు. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వద్దని అన్నారు. ఇరువురి వాదనలను విన్న కోర్టు చంద్రబాబుకు తాత్కాలిక బెయిల్ ను మంజూరు చేసింది.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page