Thursday, September 19, 2024

ప్రముఖ డ్యాన్స్‌మాస్టర్‌పై అత్యాచారం కేసు

హైదరాబాద్ :
ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ జానీపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసు నమోదైంది. హైదరాబాద్‌ రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో ఓ యువతి ఫిర్యాదు చేయడంతో జీవో ఎఫ్‌ఐఆర్‌ చేశారు పోలీసులు. నార్సింగ్‌లో తనను వేధించాడని ఆరోపించడంతో రాయదుర్గం నుండి నార్సింగ్‌ పోలీస్‌ స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు పోలీసు అధికారులు. అవుట్‌ డోర్‌కు వివిధ నగరాలకు వెల్లినప్పుడు జానీ మాస్టర్‌ తనను వేధించాడని జానీ మాస్టర్‌తనను వేధించాడని జూనియర్‌ కొరియోగ్రాఫర్‌ చేసిన ఆరోపనలు సంఛలనం రేపుతున్నాయి. ఈ కేసును పోలీసు అధికారులు పలు కోణాల్లో దర్యాప్తు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. సినీ పరిశ్రమకు అనుబంధంగా కొరియోగ్రఫ్రీ విభాగంలో వేదింపుల ఆరోపనలు, ఫిర్యాదుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకునే అవకాశాలున్నాయి. కేరళలో హేమ కమిటీ నివేదిక నేపథ్యంలో టాలీవుడ్‌లోనూ వేధింపులపై విచారణ జరుపాలని ఇటీవలే ప్రముఖ నటి సమంతా చేసిన సూచనలు, తాజాగా జానీ మాస్టర్‌పై లైంగిక వేదింపుల ఆరోపనల నేపథ్యంలో పోలీసుల విచారణలో తేలే అంశాలపై చర్చ జరుగుతోంది.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page