జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని యేటా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛతా కార్యక్రమాలు చేపడుతుంది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం దేశ వ్యాప్తంగా స్వచ్ఛత హి సేవ వారోత్సవాలు నిర్వహించారు. ఆయా గ్రామ, పట్ణణాల్లోని వీధుల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఎన్జీవోలు, యువత భాగస్వామ్య మయ్యారు. అయితే.. అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వచ్చతా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓ పాఠశాలలో విద్యార్థులతో కలసి చెత్తను ఊడ్చి డస్ట్బిన్లో వేశారు నరేంద్ర మోది. పిల్లలతో ముచ్చటించారు. మీ పరిసర ప్రాంతాల్లోనూ చెత్త లేకుండా చూసుకోవాలని, స్వచ్ఛ భారత్ స్ఫూర్తి నింపాలని పిలుపునిచ్చారు. ‘ నేను పిల్లలతో స్వచ్చతా అభియాన్లో భాగస్వామ్యం అయ్యాను. మీరూ మీ పరిసరాల పరిశుభ్రతలో భాగస్వామ్యం కావాలి’ అని సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు మోది.
ఆదేశాలతోనే కాదు..ఆచరనలోనూ ఆదర్శమే !

- Advertisment -