- పక్క ఇళ్ల నిర్మాణం, యువత కోసం కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం
- ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రియంబర్స్మెంట్ కాంగ్రెస్ ఘనతే…
- యువతకు కాంగ్రెస్ పెద్దపీట
- కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్
హుజురాబాద్, జనతా న్యూస్ : హామీలను అమలు చేయడం మరిచిన టిఆర్ఎస్ కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒడితల ప్రణవ్ అన్నారు. ఆదివారం జమ్మికుంట మండలంలోని సైదాబాద్, కోరపల్లి, వెంకటేశ్వర్ల పల్లి, పాపయ్యపల్లి, విలాసాగర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదలకు పక్కా ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ యువత సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. నియోజకవర్గంలో డిజిటల్ తో పాటు ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విధంగా తీర్చిదిద్దామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలను ప్రవేశపెట్టామని అన్నారు.అధికారంలోకి వచ్చిన 100 రోజులకు హామీల అమలు చేస్తామని అన్నారు. టిఆర్ఎస్, బిజెపి నాయకులు కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయాలని అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, అక్కడ 500 రూపాయలకే వ్యా సిలిండర్, కర్ణాటక రాష్ట్రంలో 62 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని హామీలన్నీ అమలు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కాపీ చేసి పింఛన్లు పెంచేస్తామని టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుందని, ఉన్న పింఛన్లు సమయానికి ఇవ్వడం లేదు కానీ కొత్త పింఛన్లు ఇస్తామని హామీ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. వేయికోట్ల నిధులతో హుజురాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మాటలు చెబుతున్నా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో ఎవరు ఆపారని అన్నారు. మండలానీకో ఇంటర్నేషనల్ స్థాయి పాఠశాల ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయి విద్యానందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. రెండు దశాబ్దాలుగా ప్రజలు ఈటెల రాజేందర్ ను గెలిపిస్తూ వస్తున్నారని, ఈ నియోజకవర్గ ప్రజలను కాదని గజ్వేల్లో పోటీ చేస్తున్నారని తెలిపారు. గజ్వేల్ కు వెళ్లి గజ్వేల్ ముద్దుబిడ్డనని, హుజురాబాద్ కు వచ్చి హుజురాబాద్ బిడ్డనని చెప్తున్నాడని అన్నారు. ఏడుసార్లు అవకాశం ఇచ్చినప్పటికీ ఈ నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల్లో గెలిచి మూడేళ్లు గడుస్తున్న హుజురాబాద్ కు చేయలేదని, కనీసం తన సొంత మండలమైన కమలాపూర్ మండలంలోని ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని సైతం పూర్తి చేయలేని పరిస్థితిలో ఈటెల రాజేందర్ ఉన్నారని అన్నారు. బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని బిజెపికి ఓటు వేస్తే టిఆర్ఎస్ కు వేసినట్టేనని, టిఆర్ఎస్ కు వేస్తే బిజెపికి వేసినట్లేనని తెలిపారు. ప్రశాంతంగా ఉన్న హుజురాబాద్ లో రౌడీయిజం పెరిగిపోయిందని అన్నారు. వ్యాపారులు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. వ్యాపారులకు స్వేచ్ఛ ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. వ్యాపారాలను అభివృద్ధి చేయడంతో పాటు పరిశ్రమలను తీసుకువచ్చి ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని తెలిపారు. వ్యాపారులెవరు అధైర్య పడవద్దని హుజురాబాద్ నియోజకవర్గం లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. వ్యాపారులకు అండగా ఉంటూ వారి అభివృద్ధి తోపాటు హుజూరాబాద్ ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పుల్లూరి సదానందం గూడెపు సారంగపాణి మలుగూరి సదయ్య పలు గ్రామ అధ్యక్షులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు