హైదరాబాద్ :
రాష్ట్ర ప్రభుత్వ బోనాల పాటను ఆవిష్కరించారు రాష్ట్ర మంత్రులు. హైదరాబాద్ సచివాలయం లోని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ కార్యాలయంలో సుపధ క్రియేషన్స్ రూపొందించిన బోనాల జాతర పాటను రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్,జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. అనంతరం స్క్రీన్ ద్వారా పాటను వీక్షించారు. ఈ పాటకు సంగీతం ఎంఎం శ్రీలేఖ, లిరిక్స్ తంగెళ్ళ శ్రీదేవి రెడ్డి, సింగర్ కీర్తన శర్మ, నృత్యం నాగ దుర్గ, దర్శకత్వం చేతన్, ఉదయ్ ఎడిటింగ్ చేశారు. ఈ సందర్భంగా పాటకు సహకరించిన వివిధ రంగాల కళాకారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సాంస్కృతిక శాఖ సెక్రటరీ వాణి ప్రసాద్, దేవాదాయ శాఖ సెక్రటరీ హన్మంతరావు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరిక్రిష్ణ, కరీంనగర్ కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు, పొన్నం రవిచంద్ర, చందర్ పాల్గొన్నారు.
బోనాల పాట అదుర్స్..
- Advertisment -