ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్బరేలీ పార్లమెంటులోని లాల్ గంజ్లో సెలూన్ నిర్వాహకుడు మిథున్కు బహుమతి పంపాడు కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. మే 13న గత పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో లాల్గంజ్ బహిరంగ సభకు హాజరైన సందర్భంలో ó..మిథున్ సెలూన్లో గడ్డం ట్రిమ్మింగ్ చేయించుకున్నారు రాహుల్ గాంధి. ఈ సందర్భంగా బార్బర్ కష్ట సుఖాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. మూడు నెలల తరువాత..ఆ సెలూన్ వద్దకు వాహనంలో రెండు కుర్చీలు, ఇన్వెర్టర్ సెట్, ఇతర సామాగ్రీని పంపించారు రాహుల్ గాంధీ. దీంతో బార్బర్ మిథున్ సంతోషం వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు సాధారణ, నిరుపేదలను కలుస్తుంటారు రాహుల్ గాంధీ. వారి సాదక బాధకాలు అడిగి తెలుసుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగా లాల్గంజ్లో సెలూన్ నిర్వాహకున్ని కలసిన రాహుల్ గాంధీ..అతని అవసరాలను తీర్చడం విశేషం.
బార్బర్కు రాహుల్ గాంధీ బహుమతి
- Advertisment -