కరీంనగర్, జనతా న్యూస్ : కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి బీజేపీ తరుపున బరిలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భారీగా యువకులు పాల్గొన్నారు. భారత్ మాతాకీ జై, జై రామ్ అంటూ నినాదాలు ఇచ్చారు. నగరంలోని బైపాస్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ గా వెళ్లి ఆ తరువాత నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు పత్రాలతో ఉదయం మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
