Wednesday, July 2, 2025

వంకాయ మాలాధారణలో అమ్మవారు

కరీంనగర్‌-జనత న్యూస్‌

కరీంనగర్‌ మండలం నగునూర్‌ శ్రీ దుర్గాభవానీ ఆలయంలో ఆషాడ మాస శాఖాంబరి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఆలయ ధర్మాధికారి, వేదపండితులు పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం అమ్మవారికి వంకాయ మాల లను అలంకరించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష హారతులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్‌ బాధ్యులు మమతారెడ్డి, ట్రస్ట్‌ సభ్యుల కోలాట నృత్యాలు ఆకట్టుకున్నాయి. భక్తులకు అన్నప్రసాద వితరణ చేసారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ఫౌండర్‌ వంగల లక్ష్మన్‌, కమిటి బాధ్యులు, భక్తులు పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page