- చిన్నారుల మధ్య డాక్టర్ నరేందర్ రెడ్డి
కనువిందు చేసిన ప్రదర్శన - కరీంనగర్`జనత న్యూస్
కరీంనగర్ వావిలాలపల్లి అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్నెక్ట్స్ స్కూల్ కలర్ ఫుల్గా మారింది. చిన్నారుల కలర్ఫుల్ ప్రదర్శన కనువిందు చేసింది. రెయిన్బో పేరుతో నిర్వహించిన చిన్నారుల ప్రదర్శన ఆద్యాంతం ఆకట్టుకుంది. చిన్నారులతో కలసి ఆ విద్యా సంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి సందడి చేశారు. ఎప్పుడూ బీజీ షెడ్యుల్ల్లో ఉండే ఆయన..ఇలా చిన్నారులతో కలసి వేడుకల్లో పాలు పంచుకోవడం పట్ల పిల్లలతో పాటు పేరెంట్స్ సంతోషం వ్యక్తం చేశారు. చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు పలు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నరేందర్ రెడ్డి తెలిపారు. వీటితో చిన్నారుల్లో నూతనొత్తేజంతో పాటు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుందని చెప్పారు. విద్యార్థులకు రెయిన్ బో గురించి బోధించడంతో పాటు ప్రాక్టికల్గా ఇలా చూపించడం వల్ల ఆసక్తి పెరుగుతుందని తెలిపారు. ఈ సందర్బంగా చిన్నారులు ప్రదర్శించిన ‘రెయన్బో ఇజ్ మై బెస్ట్ ఫ్రెండ్, ఓ రెయన్ ఓహో రెయన్ ’ నృత్యాలు ఆలోచింపచేశాయి.
ప్రాంగనాన్ని వివిధ రంగు రంగుల వస్తువులతో చక్కగా అలంకరించి పండుగ వాతావరణాన్ని తలిపించారు. చక్కటి ప్రదర్శనను కనబర్చిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అల్ఫోర్స్లో ‘రెయిన్బో’
- Advertisment -