– హనుమకొండ, జనతా న్యూస్ : అక్షయ తృతీయ వచ్చిందంటే బంగారం కొనుగోలు చేయాలని చాలా మంది అనుకుంటారు. కానీ కొందరు కావాల్సిన బడ్జెట్ ఉండదు. అయితే ఈ రోజు బంగారం మాత్రమే కాదని, ఏ వస్తువు కొన్నా అదృష్టమేనని కొందరు పండితులు చెబుతున్నారు. 2024 సంవత్సరంలో అక్షయ తృతీయ మే 10న రాబోతుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే జువెల్లరీ షాపులు బంగారం కొనుగోళ్లు పెరగాలని ఆఫర్లు పెట్టారు. హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలని అనుకున్నప్పటికీ సరైన బడ్జెట్ లేకపోవడంతో ఇంట్లోకి కావాల్సిన ఏ వస్తువులు కొన్నా లాభమేనంటున్నారు. అంతేకాకుండా నిరుపేదలు,మధ్యతరగతి కుటుంబాలు శక్తి కొలది పేదలకు అన్నదానం చేసినా లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారని పండితులు చెబుతున్నారు.
అక్షయ తృతీయ రోజు బంగారమే కాదు.. ఇవి కొన్నా అదృష్టమే..
- Advertisment -
