Thursday, September 19, 2024

ప్రవీణ్ కుమార్ సీఎం అయినప్పుడే కాన్సీరాంకు నిజమైన నివాళి

జనతా న్యూస్ బెజ్జంకి: బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్సీరామ్ 17వ వర్ధంతి సభకు మానకొండూర్ అసెంబ్లీ నుంచి వందలాది మంది కార్యకర్తలతో బీఎస్పీ అభ్యర్థి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ నిషాని రామచంద్రం బెజ్జంకి మండల కేంద్రం నుంచి హైదరాబాద్ బయలుదేరారు. అంతకుముందు బెజ్జంకి మండల కేంద్రంలో మాన్యువర్ కాన్సీరామ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో మెజారిటీ ప్రజలకు రాజకీయ అధికార రాకుండా కాంగ్రెస్, బిజెపిలు అడ్డుకుంటున్నారన్నారు. బహుజన కులాలకు రాజకీయ అధికారం లేకపోతే అభివృద్ధి జరగదని, అందుకే మెజారిటీ ప్రజలైన బహుజనులు రాజకీయ అధికార అందించడం కోసం కాన్సీరాం బీఎస్పీని స్థాపించారని రామచంద్రమన్నారు.

తెలంగాణలో బహుజన రాజ్యం కోసం బీసీలకు జనాభా ప్రకారం రాజకీయ అధికారం అందించడం కోసం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఉన్నత ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ అంతట పల్లె పల్లెల తిరుగుతూ బహుజనులు ఐక్యం చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో ప్రవీణ్ కుమార్ ని ముఖ్యమంత్రి చేసినప్పుడే కాన్షిరామ్ కి నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అధికార ప్రతినిధి జక్కని సంజయ్, జిల్లా ఇన్చార్జి మంద బాలయ్య, జిల్లా కన్వీనర్ సవానిపల్లి రాజ్యలక్ష్మి, జిల్లా కార్యదర్శి కుమ్మరి సంపత్, అసెంబ్లీ అధ్యక్షుడు భువనగిరి పరుశరాములు, మండల అధ్యక్షుడు మాతాంగి తిరుపతి, గుర్రం సత్యనారాయణ, దేవుని భాస్కర్, ఎదురుగట్ల సంపత్, హరీష్,మహేందర్, నిషాని సురేష్ ,గౌతమ్ జైరిపోతుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page