సిద్ధిపేట, జనత న్యూస్: సోషల్ మీడియాలో రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెడితే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని సిద్ధిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రకటనలో.. ప్రజలు, యువకులు, ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో ఫోటోలు మార్పింగ్ చేస్తూ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా సోషల్ మీడియా వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, పోస్టులు పెట్టవద్దని, అలా పెట్టిన వ్యక్తులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి తగు చర్య తీసుకుంటామన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రత్యేక సోషల్ మీడియా సెల్ ఏర్పాటు చేశామని, సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టే వారిపై IT యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను ప్రజలు నమ్మవద్దని సూచించారు. ఎవరైనా తప్పుడు వార్తలు వేసినట్లయితే సిద్దిపేట పోలీస్ కమిషనర్ కంట్రోల్ రూమ్ వాట్సప్ నెంబర్ కు 8712667100 తెలియజేయాలని అలాంటి సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు.
రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెడితే కేసు నమోదు..: సీపీ అనురాధ
- Advertisment -