Thursday, September 11, 2025

హత్య కేసులో ఒక నిందుతునికి జీవిత ఖైదు

మరొకరికి 10 సంవత్సరాల జైలు..
శిక్షలతోనే సామాజిక మార్పు
జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

సిరిసిల్ల- జనత న్యూస్

వ్యక్తి హత్యకు కారణమైన ఇద్దరు నిందితులలో ఒకరికి జీవిత ఖైదు, రూ. 2500 రూపాయల జరిమానా, మరొ వ్యక్తికి 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 2500 రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత బుధవారం తీర్పు వెలువరించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఇందుకు సంబందించిన వివరాలు మీడియాకు విడుదల చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ గ్రామానికి చెందిన పండుగ రాజం వ్యక్తి తన సోదరి అయిన పండుగ మరియమ్మ మధ్య ఆస్తుల గొడవలు జరుగుతుండేవి. 2020 సెప్టెంబర్‌ 1న పండుగ మరియమ్మ, ఆమె కుమారుడైన పండుగ మల్లేశం ఇద్దరు కలసి పండుగ రాజం ను గొడ్డలితో నరికి హత్య చేశారు. ఈ సంఘటనపై అప్పటి సిరిసిల్ల రూరల్‌ సిఐ సర్వర్‌ కేసు నమోదు చేసి పండుగ మరియమ్మ, పండుగ మల్లేశం ను రిమాండ్‌ కు తరలించి, కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్‌ ఎస్‌ ఐ రవీంద్రనాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్‌ నవీన్‌,దేవేందర్‌, కానిస్టేబుల్‌ నరేందర్‌ లు 15 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా, ప్రాసిక్యూషన్‌ తరుపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నర్సింగరావు వాదించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందుతురాలు పండుగ మరియమ్మ కి పది సంవత్సరాల జైలు శిక్ష తో పాటు రూ. 2500 రూపాయల జరిమానా, మరొక నింధితుడైన పండుగ మల్లేశం కు జీవిత ఖైదు జైలు శిక్ష తో పాటు రూ. 2500 రూపాయల జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..సమాజంలో నేరం చేసిన వారెవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని,శిక్షలతోనే సమాజంలో మార్పు వస్తుందని తెలిపారు. పోలిసులు, ప్రాసిక్యూషన్‌ వారు వ్యూహంతో న్యాయ విచారణ, న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు.ఈ కేసులో నిందితులకి శిక్ష పడటం లో కృషి చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page