జనత :
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాలో బారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం పది జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.ఆదిలాబాద్, కొమురం భీం ఆసీఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయ శంకర్ భూపాల్పల్లి, ములుగు, బద్రాద్రి కొత్త గూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అరెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.ఈ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపింది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వల్ల రానున్న రోజుల్లో మరికొన్ని జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో అధికారులను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు
- Advertisment -