9-15 వరకు త్రివర్ణ పండుగ…
సక్సెస్ చేయాలని ‘ఎక్స్’లో కేంద్ర హోం మంత్రి పిలుపు..
జనత డెస్క్ :
2022లో చేపట్టిన ‘హర్ ఘర్ తిరంగా’ఉద్యమం ఈ సంవత్సరం లోనూ కొనసాగించాలని పిలుపునిచ్చారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఈ నెల 9 నుండి 15 వరకు తమ ఇండ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయాలని సూచించిన ఆయన..ఆ సమయంలో దిగిన సెల్ఫీలను ‘హర్ ఘర్ తిరంగా’ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ప్రజలను ఆయన కోరారు. ఈ విషయాన్ని అమిత్షా శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా రెండేండ్ల క్రితం ఈ కార్యక్రమాన్ని చేపట్టిన కేంద్ర సర్కారు..ఈ సంవత్సరం కూడా ప్రజల్లో జాతీయ భావాన్ని పెంచేందుకు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని చేపడుతోంది. దీన్ని పల్లె, పట్టణాల్లో విస్తృతంగా తీసుకెళ్లేందుకు బీజేపీ శ్రేణులు కృషి చేస్తున్నారు.
హర్ ఘర్ తిరంగ ఉద్యమం..
- Advertisment -