కరీంనగర్-జనత న్యూస్
కరీంనగర్ రూరల్ మండలం నగునూర్లోని శ్రీ దుర్గాభవానీ ఆలయంలో ఆషాడ మాస శాఖాంబరి ఉత్సవాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆలయ ధర్మాధికారి, వేదపండితులు పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం అమ్మవారిని నిమ్మకాయల మాల లతో అలంకరించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష హారతులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో ఆలయ ఫౌండర్ వంగల లక్ష్మన్, కమిటి బాధ్యులు, భక్తులు పాల్గొన్నారు.
నిమ్మకాయల మాలల అలంకరణలో దుర్గాభవాని
- Advertisment -