క్యాప్సికమ్ మాలల అలంకరణలో అమ్మవారు
కరీంనగర్-జనత న్యూస్
కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ శ్రీ దుర్గా భవనీ ఆలయంలో ఆషాడ మాస శాఖాంబరి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం అమ్మవారిని క్యాప్సికమ్ మాలలతో అలంకరించారు. ఆలయ ధర్మాధికారి, వేదపండితులు పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఆలయ ప్రధానార్చకులు పవనకృష్ణ శర్మ అమ్మ వారికి విశేష హారతులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని చీరె-సారె సమర్పించి, ఓడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ఫౌండర్ వంగల లక్ష్మన్, కమిటి బాధ్యులు, భక్తులు పాల్గొన్నారు