Friday, September 12, 2025

అధికారంలోకి రాగానే పేదల రుణాల మాఫీ..

ఉత్తరప్రదేశ్: లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాషాయ పార్టీ లక్ష్యంగా సమాజవాది పార్టీ  అధినేత అఖిలేష్ యాదవ్ విమర్శలకు కురిపించారు. బిజెపి ఆయాయంలో పారిశ్రామికవేత్తలు రుణాలు 20 లక్షల కోట్లు మాఫీ చేశారని ఆయన ఆరోపించారు. యూపీలోని అజామ్ గారిలో  జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. జూన్ 4 తర్వాత కూడా బిజెపి బడా పారిశ్రామిక వ్యక్తుల రుణాలను మాఫీ చేస్తుందని అన్నారు.  అయితే విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే పారిశ్రామికవేత్తల రుణాలు కాకుండా పేదలు, రైతులు, గ్రామాల్లో నివసిస్తున్న సామాన్యుల రుణాలు మాఫీ చేస్తామని అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు. కాషాయ పాలనలో బడా పారిశ్రామికవేత్తలు, సంపన్నులకు మేలు జరిగిందని అన్నారు. ప్రధాని మోడీ తనకు సన్నిహితంగా ఉన్న పారిశ్రామికవేత్తలకు దేశ సంపాదన దోచి పెట్టారని విమర్శించారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page