IPL 2024: ఐపీఎల్ ఏడవ సీజన్ 2024లో రాయల్ చాలెంజర్స్ భారీ విజయం సాధించింది. వరుసగా ఆరు విజయాలు దక్కించుకున్న ఈ జట్టు ప్లేఆఫ్ లోకి ప్రవేశించింది. ఏమాత్రం ఆశలు లేని ఆర్సీబీకీ ఈ మ్యాచ్ కీలకం. అయినా లక్ష్య చేధనలో జట్టు సభ్యులు పోరాడి ఛాన్స్ దక్కించుకుంటున్నారు. డూప్లెస్ 54, కోహ్లీ 47, రజత్ పటిదారు 41, గ్రీన్ 38( నాటౌట్) పరుగులతో రాణించారు. మొత్తంగా 219 భారీ లక్ష్యాన్ని చెన్నై ముందు ఉంచారు. అయితే లక్ష్య చేధనలో సీఎస్ కే తడబడింది. మ్యాక్స్ వెల్ మొదటి బంతికే డకౌట్ అయ్యాడు. ఆ తరువాత మిచెల్ 4, రహనె 33 చేశారు. పవర్ ప్లే మ్యాచ్ ముగిసే సరికి చెన్నై 2 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది. ఆ తరువాత శివమ్ డూబే7, సాంటర్న్ 3తో నిరాశ పర్చారు. చివరిలో జడేజా, ధోని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. బెంగుళూరు మొత్తం 20 ఓవర్లలో 218/5, చెన్నై 20 ఓవర్లలో 191/7పరుగులు చేసింది.
IPL 2024: భారీ విజయంతో ప్లేఆఫ్ కు ఆర్సీబీ
- Advertisment -