భువనేశ్వర్: ఒడిశాలో బీజేడీ పార్టీ అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తామని ప్రకటించింది. నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే ఈ పథకంపై తొలి ఉత్తర్వులు జారీ చేస్తామని ఆ పార్టీ నాయకుడు వీకే పాండ్యన్ పేర్కొన్నారు. జూన్ 9వ తేదీన పూరి జగన్నాథ స్వామి, ప్రజల ఆశీస్సులతో నవీన్ పట్నాయక్ ఆరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని అన్నారు. ఈ ఉచిత విద్యుత్ పథకంతో 90 శాతం మంది ప్రజలకు లబ్ధి చేకూరనుందని అన్కూనారు. దేవగఢ్ జిల్లాలో సీఎం నవీన్ పట్నాయక్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విషయాలు వివరించారు. దీని ప్రకారం రాష్ట్రంలో అన్ని గృహాలకు 100 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని స్పష్టం చేశారు. అలాగే 150 యూనిట్ల విద్యుత్ వాడకం ఉంటే అందులో 50 యూనిట్లు ఉచితమని తెలిపారు.
ఉచిత విద్యుత్ పై తొలి సంతకం..
- Advertisment -