Wednesday, September 10, 2025

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్

ఢిల్లీ: లిక్కర్  కేసులో అరెస్ట్ అయి తిహాడ్ జైలులో ఉన్న  ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీ వాల్ కు  మధ్యంతర బెయిల్ లభించింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచార నిమిత్తం జూన్ 1 వరకు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం  తీర్పు వెలువరించింది .మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న  ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను  అరెస్టు చేశారు. అంతకు ముందు ఈ కేసులో విచారణకు రావాలంలూ ఈడీ 9 సార్లు నోటీసులు జారీ చేసింది.  అయినా వాటికి స్పందించకపోవడంతో ఈడి 21న అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం కేజ్రీవాల్ తీహాడ్  జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తన అరెస్టును  సవాలు చేస్తూ కేజ్రీవాల్  సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page