విజయవాడ, జనత న్యూస్: ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకం అయ్యారు. 1992 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ఈయన ను తక్షణం విధుల్లో చేరాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా సీఎస్ జవహర్ రెడ్డికి సమాచారం అందించింది. మొన్నటి వరకు ఉన్న ఏపీ డీజీపీ కేవీ రాజేంద్ర నాథ్ పై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. దీంతో ఈ పోస్టులో ఎవరు నియామకం అవుతారోనని ఆసక్తినెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాఫ్, హరీష్ కుమార్ గుప్తాను పంపింది. దీంతో హరీష్ కుమార్ గుప్తాను ఎలక్షన్ సంఘం ఓకే చేసింది.
ఆంధ్రప్రదేశ్ కు కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా
- Advertisment -